Tuesday, July 27, 2010
Monday, July 26, 2010
పల్నాటి వీరభారతం నాలుగో అధ్యాయం
నాయకురాలు నాగమ్మ కోటలో పాగా వేసింది. తన పాచిక పారేందుకు సకల సన్నాహాలూ చేసుకుంది.
పాపమెరుగని పసితనపు పేరిందేవి, నెలరాజులా పెరుగుతున్న అలరాజు కాబోయే దంపతులు.
తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి విషనాగును ఇంట చేర్చుకున్న నలగాముడు అనుమానపు ఊబిలోకి దిగుతున్నాడు.
మున్ముందు వీరి జీవితాలతో విధి ఎలా ఆటాడబోతున్నదో!
చదవండి...పల్నాటి వీరభారతం నాలుగో అధ్యాయం
పాపమెరుగని పసితనపు పేరిందేవి, నెలరాజులా పెరుగుతున్న అలరాజు కాబోయే దంపతులు.
తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి విషనాగును ఇంట చేర్చుకున్న నలగాముడు అనుమానపు ఊబిలోకి దిగుతున్నాడు.
మున్ముందు వీరి జీవితాలతో విధి ఎలా ఆటాడబోతున్నదో!
చదవండి...పల్నాటి వీరభారతం నాలుగో అధ్యాయం
Monday, July 19, 2010
పల్నాటి వీరభారతం - అధ్యాయం 3
ఐతాంబ-బ్రహ్మనాయులకు "బాలచంద్రుడు" లేక లేక పుట్టిన బిడ్డడు. కానీ బ్రహ్మనాయుడు కొడుకునే వదులుకోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చాడు.
బ్రహ్మనాయుని ఈ కాఠిన్యం వెనుక ఉన్న ప్రబల కారణం ఏమిటి? ఎలాంటి పరిస్థితులు ఓ కన్నతండ్రిని ఇలాంటి కార్యాన్ని చేయడానికి పురిగొల్పాయి?
చదవండి...పల్నాటి వీరభారతం మూడవభాగం
బ్రహ్మనాయుని ఈ కాఠిన్యం వెనుక ఉన్న ప్రబల కారణం ఏమిటి? ఎలాంటి పరిస్థితులు ఓ కన్నతండ్రిని ఇలాంటి కార్యాన్ని చేయడానికి పురిగొల్పాయి?
చదవండి...పల్నాటి వీరభారతం మూడవభాగం
Friday, July 16, 2010
సోంపేట స్ఫూర్తి By Savyasachi K
మనం ఎన్నుకున్న ప్రభుత్వపు విధానాలు మనకు నచ్చనప్పుడు, వ్యతిరేకత ఎలా ప్రకటించాలి? అందులోనూ, మన కనీస అవసరాలకు, అవకాశాలకు ప్రభుత్వమే గండి కొడుతున్నప్పుడు ఏం చేయాలి?
కలెక్టరుకో, మరో అధికారికో వినతి పత్రాలు సమర్పిస్తాం. అవి బుట్టదాఖలౌతుంటే, కోర్టులో కేసులు వేస్తాం. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే ఓపిక లేకపోతే, మూకుమ్మడిగా ఆందోళన చేస్తాం. దాదాపు 30 గ్రామాల ప్రజలు చేసిందదే. పర్యవసానం, పాశవికంగా ప్రభుత్వం చేసిన బలప్రయోగానికి సోంపేటలో కొందరి దుర్మరణం.
తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే ప్రభుత్వ అధికారులను, పోలీసులను కాల్చి చంపే నక్సలైట్లకు, తమ విధానాలను వ్యతిరేకించే ప్రజలను పోలీసు కాల్పులతో చంపేసే ప్రభుత్వానికి తేడా ఏమిటి? నక్సలైట్లనైతే సంఘవిద్రోహులుగా ప్రకటిస్తాం. మరి ప్రభుత్వాన్నేం చేయాలి? విచిత్రమేమిటంటే, ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారినందరినీ నక్సలైట్లుగా ముద్రవేసి, ప్రగతి నిరోధక శక్తులుగా ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం.
Click here to read complete article...
కలెక్టరుకో, మరో అధికారికో వినతి పత్రాలు సమర్పిస్తాం. అవి బుట్టదాఖలౌతుంటే, కోర్టులో కేసులు వేస్తాం. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే ఓపిక లేకపోతే, మూకుమ్మడిగా ఆందోళన చేస్తాం. దాదాపు 30 గ్రామాల ప్రజలు చేసిందదే. పర్యవసానం, పాశవికంగా ప్రభుత్వం చేసిన బలప్రయోగానికి సోంపేటలో కొందరి దుర్మరణం.
తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే ప్రభుత్వ అధికారులను, పోలీసులను కాల్చి చంపే నక్సలైట్లకు, తమ విధానాలను వ్యతిరేకించే ప్రజలను పోలీసు కాల్పులతో చంపేసే ప్రభుత్వానికి తేడా ఏమిటి? నక్సలైట్లనైతే సంఘవిద్రోహులుగా ప్రకటిస్తాం. మరి ప్రభుత్వాన్నేం చేయాలి? విచిత్రమేమిటంటే, ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారినందరినీ నక్సలైట్లుగా ముద్రవేసి, ప్రగతి నిరోధక శక్తులుగా ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం.
Click here to read complete article...
Wednesday, July 14, 2010
గుండె పాట By గోపీనాథ శర్మ
గుండె పాట
వెలివేస్తు నన్ను, నువ్వెళ్ళిపోకు
తలపోస్తు నిన్ను, నేనుండలేను
నీ పాటలోని పదములు నేనే
నా బాటలోని పదములు నీవే
Complete poem in Avakaaya.com - Selayeru
Sunday, July 11, 2010
పల్నాటి వీరభారతం - అధ్యాయం 2
పల్నాటి చరిత్ర కాలచక్రంలో పదిహేనేళ్ళు తిరిగిపోయాయి.
రాజవిలాసాల్లో ముఖ్యమైనది - వేట. ఒకసారి అనుగురాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని కారాటవికి వేటకెళ్ళాడు.
పగలల్లా వేటాడి అలిసిపోయిన శరీరం పులిసిపోయింది. జవనాశ్వాలు సాలితో రొప్పుతూ జిట్టగామాలపడు, నాగులేటి ఒడ్డుకొచ్చాయి.
ఇప్పుడు "అనుగురాజు"కు కావల్సింది కాసేపు విశ్రాంతి, మనుష్య సంచారం తక్కువైన ఈ ప్రాంతంలో తనకోసం చలువ పందిళ్ళు వేసి, విశ్రాంతికి విడిది చూపించినవాళ్ళెవరో అనుగురాజుకు అర్థం కాలేదు. పరివారమూ, అశ్వాలూ విశ్రాంతి తీసుకుంటున్నాయి.
అప్పటికి నాగమాంబకు పద్ధెనిమిదేళ్ళు. వేదవేదాంగాలు చదువుకున్న నాగమాంబ మేనమామ సింగారెడ్డిని పదమూడో ఏట పెళ్ళి చేసుకున్నది. కానీ కాలం కాటంది, సింగారెడ్డి పెళ్ళైన సంవత్సరానికే కన్నుమూస్తే - నాగమాంబ బాలవితంతువైంది. పంటరెడ్ల కుటుంబంలో పుట్టిన నాగమాంబ శివభక్తురాలు. భర్త పోయాక నాగమాంబ "నాగమ్మ" అయింది.
పూర్తి కథ చదవాలంటే ఇక్కడ నొక్కండి
రాజవిలాసాల్లో ముఖ్యమైనది - వేట. ఒకసారి అనుగురాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని కారాటవికి వేటకెళ్ళాడు.
పగలల్లా వేటాడి అలిసిపోయిన శరీరం పులిసిపోయింది. జవనాశ్వాలు సాలితో రొప్పుతూ జిట్టగామాలపడు, నాగులేటి ఒడ్డుకొచ్చాయి.
ఇప్పుడు "అనుగురాజు"కు కావల్సింది కాసేపు విశ్రాంతి, మనుష్య సంచారం తక్కువైన ఈ ప్రాంతంలో తనకోసం చలువ పందిళ్ళు వేసి, విశ్రాంతికి విడిది చూపించినవాళ్ళెవరో అనుగురాజుకు అర్థం కాలేదు. పరివారమూ, అశ్వాలూ విశ్రాంతి తీసుకుంటున్నాయి.
అప్పటికి నాగమాంబకు పద్ధెనిమిదేళ్ళు. వేదవేదాంగాలు చదువుకున్న నాగమాంబ మేనమామ సింగారెడ్డిని పదమూడో ఏట పెళ్ళి చేసుకున్నది. కానీ కాలం కాటంది, సింగారెడ్డి పెళ్ళైన సంవత్సరానికే కన్నుమూస్తే - నాగమాంబ బాలవితంతువైంది. పంటరెడ్ల కుటుంబంలో పుట్టిన నాగమాంబ శివభక్తురాలు. భర్త పోయాక నాగమాంబ "నాగమ్మ" అయింది.
పూర్తి కథ చదవాలంటే ఇక్కడ నొక్కండి
Friday, July 9, 2010
సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా? మొదటి భాగం
"విచారించి చూస్తే, సుఖం అన్నది శరీరంలోని పదార్థమే కానీ శరీరానికి ఆవలనున్నది కాదు. సుఖం జీవి (soul) అంతఃకరణం యొక్క ధర్మమే అయివున్నది."
సుఖమంటే తమకు అనుకూలమైనదనే భావించినప్పుడు, దాని ప్రతికూలమైనవన్నీ దుఃఖాలే. ఈ సుఖదుఃఖాలు మన వశంలో లేనివి. ఒకవేళ అవి మన అధీనంలోనే ఉన్నవైతే ఎవ్వరూ దుఃఖపడకూడదు. ఎల్లప్పుడూ సుఖభోగులయ్యే ఉండాలి. కానీ, అలా ఎవ్వరూ శాశ్వత సుఖభోగులు కానందువల్ల, శాస్త్రాలలో చెప్పిన విధంగా మనం అనుభవించే సుఖదుఃఖాలు మన అదుపులోలేనివని తెలుసుకోవాలి
Click here to read complete article...
సుఖమంటే తమకు అనుకూలమైనదనే భావించినప్పుడు, దాని ప్రతికూలమైనవన్నీ దుఃఖాలే. ఈ సుఖదుఃఖాలు మన వశంలో లేనివి. ఒకవేళ అవి మన అధీనంలోనే ఉన్నవైతే ఎవ్వరూ దుఃఖపడకూడదు. ఎల్లప్పుడూ సుఖభోగులయ్యే ఉండాలి. కానీ, అలా ఎవ్వరూ శాశ్వత సుఖభోగులు కానందువల్ల, శాస్త్రాలలో చెప్పిన విధంగా మనం అనుభవించే సుఖదుఃఖాలు మన అదుపులోలేనివని తెలుసుకోవాలి
Click here to read complete article...
Sunday, July 4, 2010
పల్నాటి వీరభారతం అధ్యాయం- 1
తెలి వులిపిరి తెరల మధ్య తెల్లవారీ ఆరకముందే, పక్షులన్నీ గూళ్ళనుంచి బైటికి వొచ్చీ రాకముందే - తేనెటీగలు పూవుల మీద ముసిరీ ముసరకముందే, "జిట్టగామాలపాడు" ఉత్తరాన వున్న బీళ్ళలో ఆరవల్లి రామిరెడ్డి అరక దున్నుతున్నాడు.
సూర్యుడు మబ్బుల మీద షికారుకు బైల్దేరినవేళ రామిరెడ్డి "చుట్ట" అంటించుకోవటానికి నిలబడ్డాడు. చేను నానుకుని, నాలుగ్గజాల దూరంలో, గట్టు మీద పెద్ద పాముపుట్ట ఉంది. రామిరెడ్డికి సుప్రభాతపు వెలుగు పర్చుకుంటున్నప్పుడు "కేర్ ... కేర్ .." మనే ఏడుపు వినిపించింది..
అతను ఛటక్కున ఆగిపోయాడు.
పూర్తి కథ చదవాలంటే ఇక్కడ నొక్కండి
సూర్యుడు మబ్బుల మీద షికారుకు బైల్దేరినవేళ రామిరెడ్డి "చుట్ట" అంటించుకోవటానికి నిలబడ్డాడు. చేను నానుకుని, నాలుగ్గజాల దూరంలో, గట్టు మీద పెద్ద పాముపుట్ట ఉంది. రామిరెడ్డికి సుప్రభాతపు వెలుగు పర్చుకుంటున్నప్పుడు "కేర్ ... కేర్ .." మనే ఏడుపు వినిపించింది..
అతను ఛటక్కున ఆగిపోయాడు.
పూర్తి కథ చదవాలంటే ఇక్కడ నొక్కండి
Friday, July 2, 2010
తాంబూలాలిచ్చేసాం! By kadambari piduri,
For more articles from kadambari piduri
Subscribe to:
Comments (Atom)