Monday, August 30, 2010

Fun & Spoof articles




More Fun & Spoof news @ WoW - Wonders Of The World


Sunday, August 29, 2010

పల్నాటి వీరభారతం అధ్యాయం-9



"కానున్నది కాకమానదు" అన్న తెగింపు ఊహించలేని పరిణామానికి దారితీస్తోంది.

పంతం, పౌరుషం పొడుచుకొచ్చినప్పుడు శాంతం, సహనం చేయి విడుస్తాయి.

నాయకురాలి కవ్వింపు సై అన్న బ్రహ్మన్న కోడిపందాలకు సిద్ధమయ్యాడు.

"కోడేరు" పొలిమేరల్లోని గుట్టల్లో గురజాల, మాచెర్ల ప్రజలు గుమిగూడారు. పుంజులు ప్రభువుల కోసం పోరాడడానికి సిద్ధంగా వున్నాయి.

చారిత్రాత్మకమైన పల్నాటి కోడిపందాలకు జరిగిన ఏర్పాట్లు ఎలాంటివి?

చదవండి...పల్నాటి వీరభారతం తొమ్మిదవ అధ్యాయంలో


 

Sunday, August 22, 2010

పల్నాటి వీరభారతం - అధ్యాయం 8



బ్రహ్మనాయుడికి మాల కన్నమదాసు ఎలా ముఖ్యుడో, నాయకురాలు నాగమ్మకు "వీరభద్రుడు" అంతే ముఖ్యుడు.
వీరకన్నమదాసు-వీరభద్రుడూ ఒకేరకపు గొప్ప యోధులు. వీరత్వానికి పల్నాటి ప్రతీకలు.
మనిషి కన్నా భయంకరమైన జంతువుగానీ, అవిశ్వాసకరమైన ప్రాణిగానీ మరొకటి లేదు. మనిషి పాలు తాగి పెరిగిన పాప, పెద్దయ్యాక అవిశ్వాసకరంగా, దుష్టుడుగా మారటానికి అవకాశమున్నది. కాని మనిషికి కుక్కపాలు పోసి పెంచితే, విశ్వాసకరంగా పెరుగుతాడనేది నాగమాంబ నమ్మకం. అందుకే దిక్కూదివాణం లేని పసివాణ్ణొక్కణ్ణి కుక్కపాలు పోసి పెంచి పెద్దవాణ్ణి చేసింది. వాడే వీరభద్రుడు. "నాగభూషణుడి"కి అలనాటి వీరభద్రుడెంతో, నాగమాంబకు పలనాటి వీరభద్రుడూ అంతే.

Click here to read the complete episode

Friday, August 20, 2010

సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా? రెండవ భాగం

లోకంలో "ధర్మం", "అధర్మం", "దేవుడు" మొదలైన పదాలున్నాయి. ఈ పేర్లతో పిలువబడే వస్తువులు మనకు తెలియనప్పటికీ అవి ఉండి తీరాలి. ఎలాగంటే మనకు తెలియని ఒక పదార్థముంటే దానికొక పేరున్నట్టే! భాషలోని ఏ పదమూ వ్యర్థం కాదు. దీన్నే కాళిదాసు -


వాగర్థావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ


అని చెప్పాడు. ప్రపంచంలో ఏదైనా ఎక్కడైనా ఉన్నా అది "వస్తువు " అన్న పేరును పొందుతుంది. క్రియలు గానీ, గుణాలు గానీ వస్తువులోనే అంతర్భావాన్ని పొందుతాయని తెలుసుకోవాలి. ఒక పదం మనకు దొరికినప్పుడు ఆ పేరుతో పిలవబడే పదార్థం మనకు తెలియకపోయినా ఆ పదం ద్వారా సూచితమయ్యే వస్తువు త్రికాలాల్లో ఎప్పుడైనా ఉండి ఉంటుందనే భావించాలి.

Click here to read complete article..

Tuesday, August 17, 2010

పల్నాటి వీరభారతం - అధ్యాయం 7

ప్రతి రాజ చరిత్రలోనూ, ఈ విధమైన రక్తపాతాలతో, ఆత్మత్యాగాలతో నిండిన ప్రేమ కథలు కనిపిస్తాయి. సజీవ సాహితికి ఇవి మెరుగులు పెడతాయి. ప్రాణం కన్నా ప్రేమే ఎక్కువైతే, ప్రేమంత గొప్పది ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు.

బ్రహ్మనాయుడు క్షణం నిశ్శబ్దంగా నిలబడి "వీరసోమా! ఈ ప్రేమికుల్ని చంపిన పాపం మనిద్దరికీ చుట్టుకుంటే, ఆ పాపంలో సగభాగం నాకూ ఉంది" అని బైటకి వచ్చాడు. వచ్చేటప్పుడు పిల్లలిద్దర్నీ చేరే చంకలో ఎక్కించుకుని మరీ వచ్చాడు.


జాలిని రేకెత్తించే నాగులాదేవి, శివసింగు అమర ప్రేమ కథను చదవండి ఈవారం "పల్నాటి వీరచరిత్ర" ఏడవ అధ్యాయంలో

Sunday, August 8, 2010

పల్నాటి వీరభారతం ఆరో భాగం

నదిలో ముందుకు పారిన నీరు - బ్రతుకులో ముందుకు కదిలిపోయే కాలం వెనక్కు రావు.

పల్నాటిలో మూడో తరం పెరుగుతోంది - బాలచంద్రుడు, మాంచాలా, పేరిందేవి రూపాల్లో!

రెండో తరపు ప్రతినిధులు - బ్రహ్మనాయుడు, నలగాముడు విరోధులుగా మారుతున్నారు.

అవమానాలతో బాటు సవతి సోదరులను బంధీలు చేసిన నలగామునిపై దండెత్తి వస్తాడు బ్రహ్మన్న.

ఈ స్థితిలో, కుటిలనీతితో మంత్రిత్వం నెరపుతున్న నాగమ్మ ఏం చేసింది?

చదవండి - పల్నాటి వీరభారతం ఆరో భాగం

Sunday, August 1, 2010

పల్నాటి వీరభారతం - అధ్యాయం 5

పతనం, ప్రళయం హటాత్తుగా రావు. కొన్ని ముందస్తు సూచనలతో, సంకేతాలతో ముందడుగులు వేస్తూ వస్తాయి.

గమనించదగ్గ కళ్ళు, నివారించదగ్గ బుద్ధి ఉన్నవారు తోడువుంటే తెలివిగా నివారించుకోవచ్చు. కానీ ఉన్మత్తస్థితిలో, ఉచ్ఛనీచాలను మరచినవారు ఆ ప్రళయోత్పాతంలో మునిగి నాశనం కావల్సిందే!

ఇదేనా నలగాముని భవితవ్యం? ఇదేనా నాయకురాలు నాగమ్మ ఇంగితం? వ్యర్థమేనా, బ్రహ్మనాయని శక్తియుక్తులు?

చదవండి - పల్నాటివీరభారతం ఐదవ భాగం