న్యాయం అనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసినా ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు.
మాచెర్ల వీరుల్లో పగ రగుల్కొంటోంది.
"ఇది అధర్మయుద్ధం. మనం అరణ్యవాసం చేయనక్కరలేదు" అని కొంతమంది అన్నారు.
"మాట పాటించనివాడు బ్రతికున్నా చచ్చినవాడితో సమానం. ఆడి తప్పని జాతి మనది - పందెంలో మోసం జరిగినా, మనం ఓడినట్టే లెక్క!"
మలిదేవాదులు బ్రహ్మన్నను సమర్థించారు.
తమ పరివారమూ, అంత:పురకాంతలూ - మలిదేవాదులతో ఆరోజున అరణ్యవాసానికి ప్రయాణమైనాడు బ్రహ్మన్న.
No comments:
Post a Comment