మన ఇతిహాస పురాణాలలోని సామాజిక కట్టుబాట్లను అదేపనిగా విమర్శించే కామెడీ మేధావులు మనకు మనం వ్రాసుకున్న రాజ్యాంగమనే కట్టుబాటును విమర్శిస్తే ఎందుకో తట్టుకోలేరు. దేవుడు లేడు, భక్తి ముక్తి అంతా ట్రాష్ అనే హేతువాద నాస్తికోన్మాదులు రాజ్యాంగాన్ని విమర్శిస్తే, ఆ విమర్శించినవాడికి దేశభక్తి లేదని తీర్మానిస్తారు! సరే, ఇదో విషాయంతరం కాబట్టి దాని గురించి ప్రస్తుతం వాదించటంలేదు.
సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా మనలని మనం ప్రకటించుకుని అరవై ఏళ్ళు దాటింది. ఆరు దశాబ్దాల మన రాజ్యాంగం కొందరు మేధావులకు రామాయణం కన్నా పవిత్రమైనదైతే, కొందరికి అదో అతుకుల బొంత, మరికొందరికి అదో కుప్పతొట్టి. సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకోవటంతో సంతృప్తి చెందక, 1976కల్లా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మారిపోయాం.
మన రాజ్యాంగం విమర్శలకు అతీతమా? వందకోట్లకు పైగా ఉన్న భారతీయులకు ఈ రాజ్యాంగం నిజంగానే మార్గదర్శక సూచికా? ఏమిటి ఆ గొప్పదనం?
No comments:
Post a Comment