For more articles, please click here
Friday, September 24, 2010
Sunday, September 19, 2010
పల్నాటి వీరభారతం - అధ్యాయం 11
న్యాయం అనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసినా ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు.
మాచెర్ల వీరుల్లో పగ రగుల్కొంటోంది.
"ఇది అధర్మయుద్ధం. మనం అరణ్యవాసం చేయనక్కరలేదు" అని కొంతమంది అన్నారు.
"మాట పాటించనివాడు బ్రతికున్నా చచ్చినవాడితో సమానం. ఆడి తప్పని జాతి మనది - పందెంలో మోసం జరిగినా, మనం ఓడినట్టే లెక్క!"
మలిదేవాదులు బ్రహ్మన్నను సమర్థించారు.
తమ పరివారమూ, అంత:పురకాంతలూ - మలిదేవాదులతో ఆరోజున అరణ్యవాసానికి ప్రయాణమైనాడు బ్రహ్మన్న.
Friday, September 17, 2010
Global Recession - India And Its Link!
INDIA CAN’T SURVIVE A GLOBAL RECESSION
So says Real Estate & Stock Market expert J. Vishnu Shankar.
Vishnu Shankar wrote several exclusive articles for http://www.aavakaaya.com/ & predicted the high profile collapses like Satyam (Read this article)
Vishnu predicts that the more tougher times are ahead & this time India may not succeed in withstanding the storm.
In "India And Its Link" Read his eloborate analysis of current economic situation and forthcoming big & longer recession.
Wednesday, September 15, 2010
కుప్పతొట్టి రాజ్యాంగం
మన ఇతిహాస పురాణాలలోని సామాజిక కట్టుబాట్లను అదేపనిగా విమర్శించే కామెడీ మేధావులు మనకు మనం వ్రాసుకున్న రాజ్యాంగమనే కట్టుబాటును విమర్శిస్తే ఎందుకో తట్టుకోలేరు. దేవుడు లేడు, భక్తి ముక్తి అంతా ట్రాష్ అనే హేతువాద నాస్తికోన్మాదులు రాజ్యాంగాన్ని విమర్శిస్తే, ఆ విమర్శించినవాడికి దేశభక్తి లేదని తీర్మానిస్తారు! సరే, ఇదో విషాయంతరం కాబట్టి దాని గురించి ప్రస్తుతం వాదించటంలేదు.
సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా మనలని మనం ప్రకటించుకుని అరవై ఏళ్ళు దాటింది. ఆరు దశాబ్దాల మన రాజ్యాంగం కొందరు మేధావులకు రామాయణం కన్నా పవిత్రమైనదైతే, కొందరికి అదో అతుకుల బొంత, మరికొందరికి అదో కుప్పతొట్టి. సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకోవటంతో సంతృప్తి చెందక, 1976కల్లా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మారిపోయాం.
మన రాజ్యాంగం విమర్శలకు అతీతమా? వందకోట్లకు పైగా ఉన్న భారతీయులకు ఈ రాజ్యాంగం నిజంగానే మార్గదర్శక సూచికా? ఏమిటి ఆ గొప్పదనం?
Sunday, September 12, 2010
పల్నాటి వీరభారతం పదవ అధ్యాయం
వ్యసనం జీవనాన్ని మసిబారేట్టు చేస్తుంది.
అంత చెరువుకు ఇంత తూము చాలన్నట్టు బ్రహ్మనాయుని ఉన్నతమైన వ్యక్తిత్వంలో "కోడి పందెం" వ్యసనం మచ్చ తెచ్చేనా?
మంత్రాంగంలో శకునిని పోలిన నాగమ్మ గెలుపు కోసం అడ్డదారులు తొక్కదా?
ధర్మం, న్యాయం, మర్యాద చేతగానివాళ్ళ లక్షణాలా?
తెలుసుకోవాలంటే...చదవండి పల్నాటి వీరభారతం పదవ అధ్యాయం
Labels:
online weekly serial,
Telugu novel,
పల్నాటి వీరభారతం
Monday, August 30, 2010
Fun & Spoof articles
Sunday, August 29, 2010
పల్నాటి వీరభారతం అధ్యాయం-9
"కానున్నది కాకమానదు" అన్న తెగింపు ఊహించలేని పరిణామానికి దారితీస్తోంది.
పంతం, పౌరుషం పొడుచుకొచ్చినప్పుడు శాంతం, సహనం చేయి విడుస్తాయి.
నాయకురాలి కవ్వింపు సై అన్న బ్రహ్మన్న కోడిపందాలకు సిద్ధమయ్యాడు.
"కోడేరు" పొలిమేరల్లోని గుట్టల్లో గురజాల, మాచెర్ల ప్రజలు గుమిగూడారు. పుంజులు ప్రభువుల కోసం పోరాడడానికి సిద్ధంగా వున్నాయి.
చారిత్రాత్మకమైన పల్నాటి కోడిపందాలకు జరిగిన ఏర్పాట్లు ఎలాంటివి?
చదవండి...పల్నాటి వీరభారతం తొమ్మిదవ అధ్యాయంలో
Subscribe to:
Posts (Atom)