మనిషి జీవితంలో కాలానిదెప్పుడూ చిత్రమైన పాత్ర. కాలం మనిషినెప్పుడైనా కనికరించవచ్చు; కాటు వేయావచ్చు.
అధర్మపు పందెంలో రాజ్యాన్ని పోగొట్టుకున్న మాచెర్ల ప్రభువులు మండాదిలో అనుభవించిన జీవితం అంత సుఖకరమైనది కాదు.
రాజప్రాసాదాలలో, హంసతూలికా తల్పాల మీద పవళించిన ప్రభువులు, దుర్భరమైన వనవాసంలాంటి బ్రతుకునే గడిపారు.
వీరులైన తన పరివారం మరోసారి హృదయవిదారకమైన దెబ్బతిన్నారు. ఆత్మశాంతి లేక అలమటించిపోయిన బ్రహ్మన్న, కాలం తీసిన దెబ్బకు లొంగిపోక తప్పింది కాదు.
దెబ్బ తిన్న బెబ్బులి దెబ్బ తీయక ఉండగలదా? మౌనం వహించిన బ్రహ్మన్న ముందడుగు వెయ్యక ఉండగలడా?
మౌనం వీడిన బ్రహ్మన్న ఏం చేసాడో...చదవండి పల్నాటి వీరభారతం పదమూడవ అధ్యాయం లో
No comments:
Post a Comment