మహాత్మాగాంధీ - పాదుకా పట్టాభిషేకం By kadambari piduri
బాపూజీ South Africaలో ఉన్నప్పుడు తన జీవితాన్ని ఆదర్శ ప్రాయంగా నిలపగలిగేందుకు ఉన్న పునాదులను బలిష్ఠంగా చేసుకునే దిశలో ఆయన తన ప్రవర్తనను మలుచుకున్నారు.
ఆ సమయంలో దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ ప్రెసిడెంటుగా Smutts ఉన్నాడు. Smutts హయాంలోనే గాంధీజీ అక్కడ నివసించారు.అప్పుడు గాంధీ చెప్పులూ, బూట్లూ చేయడం నేర్చుకున్నారు.
స్మట్స్ నియంతగా వ్యవహరించే వాడు.భారతీయుల పట్ల నిరంకుశ ధోరణి విపరీతంగా ఉండేది. ఆ క్రమంలో గాంధీజీ కూడా చెరసాల పాలయ్యారు.
బాపూజీ కారాగారంలో ఉన్నప్పుడు కూడా వృధా కాలయాపన చేసే వారు కాదు. తాను అభ్యసించిన పాదుకా కళా ప్రావీణ్యాన్ని సద్వినియోగ పరుచుకున్నారు. జైలులో బూట్ల జతను కుట్టారు. సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు తాను తయారించిన ఆ pair of shoesను General Smutts కు బహుమతిగా ఇచ్చారు.[ఇలాంటి సౌజన్యతకు ముగ్ధుడైన స్మట్స్ ఆ షూస్ ను 24 సంవత్సరాల పాటు తన వద్ద భద్రంగా దాచుకున్నాడు, తర్వాత 60 వ జన్మదిన (షష్ఠి పూర్తి)సందర్భంగా మహాత్మా గాంధీజీ కి మరల ఇచ్చేసారు. అప్పుడు స్మట్సు ఒక చిన్న వాక్యాన్ని దానికి జత చేసాడు - “I don't suppose I have the right to step on the footwear presented by a Mahatma like you”. ఆ క్షణంలో జనరల్ స్మట్స్ జెంటిల్మెన్ స్మట్స్ గా మారాడు. ఇది అహింస యొక్క గొప్పదనం!
No comments:
Post a Comment