Wednesday, November 17, 2010

Recipes in Avakaaya.com

 Find out the ways to lure your taste buds....

Read the receipes section in Avakaaya.com....Click Here



 

Saturday, October 30, 2010

మహాత్మాగాంధీ - పాదుకా పట్టాభిషేకం

మహాత్మాగాంధీ - పాదుకా పట్టాభిషేకం By kadambari piduri


బాపూజీ South Africaలో ఉన్నప్పుడు తన జీవితాన్ని ఆదర్శ ప్రాయంగా నిలపగలిగేందుకు ఉన్న పునాదులను బలిష్ఠంగా చేసుకునే దిశలో ఆయన తన ప్రవర్తనను మలుచుకున్నారు.



ఆ సమయంలో దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ ప్రెసిడెంటుగా Smutts ఉన్నాడు. Smutts హయాంలోనే గాంధీజీ అక్కడ నివసించారు.అప్పుడు గాంధీ చెప్పులూ, బూట్లూ చేయడం నేర్చుకున్నారు.


స్మట్స్ నియంతగా వ్యవహరించే వాడు.భారతీయుల పట్ల నిరంకుశ ధోరణి విపరీతంగా ఉండేది. ఆ క్రమంలో గాంధీజీ కూడా చెరసాల పాలయ్యారు.


బాపూజీ కారాగారంలో ఉన్నప్పుడు కూడా వృధా కాలయాపన చేసే వారు కాదు. తాను అభ్యసించిన పాదుకా కళా ప్రావీణ్యాన్ని సద్వినియోగ పరుచుకున్నారు. జైలులో బూట్ల జతను కుట్టారు. సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు తాను తయారించిన ఆ pair of shoesను General Smutts కు బహుమతిగా ఇచ్చారు.[ఇలాంటి సౌజన్యతకు ముగ్ధుడైన స్మట్స్ ఆ షూస్ ను 24 సంవత్సరాల పాటు తన వద్ద భద్రంగా దాచుకున్నాడు, తర్వాత 60 వ జన్మదిన (షష్ఠి పూర్తి)సందర్భంగా మహాత్మా గాంధీజీ కి మరల ఇచ్చేసారు. అప్పుడు స్మట్సు ఒక చిన్న వాక్యాన్ని దానికి జత చేసాడు - “I don't suppose I have the right to step on the footwear presented by a Mahatma like you”. ఆ క్షణంలో జనరల్ స్మట్స్ జెంటిల్మెన్ స్మట్స్ గా మారాడు. ఇది అహింస యొక్క గొప్పదనం!

Monday, October 18, 2010

నాలుగో పుట్టినరోజు


ఆవకాయ.కామ్ నేటితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో ఏడాదిలోకి అడుగిడుతోంది.

గత విజయదశమి నుండి నేటి విజయదశమి వరకూ సాగిన ప్రస్థానాన్ని ఒకసారి అవలోకిస్తే...30 పైగా రచయితలు, 404 రచనల ద్వారా దాదాపు 800 పైగా పుటల సమాచారాన్ని అందించడం జరిగింది. 17,000 పైగా సందర్శకులు 90,000 పైగా పేజ్ వ్యూస్ చూసారు.

ఈ లెక్కలు ఇంటర్నెట్ లో ఆవకాయ పై పెరుగుతున్న అభిమానానికి నిదర్శనం. నూటికి నూరు శాతం సభ్యుల ద్వారా, పాఠకుల కోసం అందించబడుతున్న ఈ సమాచార స్రవంతి ఇలా ప్రవహిస్తూ ఉండడమే మా ఆశయం.

ప్రతిసారిలానే, గత సంవత్సరంలో కూడా ఆవకాయ.కామ్ కొన్ని సరికొత్త విషయాలను ఆవిష్కరించింది. అందులో ముఖ్యమైనది కొత్త ముఖపుటం. ఇందులో అందాని కంటే ఆనందానికే పెద్ద పీట వేయడం జరిగింది.

* ఆవకాయ.కామ్ కుటుంబానికే చెందిన ఇతర స్రవంతులైన Kajjaya.com, RadioChilli.net, Avakaaya Toolbar ఒకేచోట నుంచే చేరుకునే ఏర్పాటి చేయడం జరిగింది.

* Download Section ద్వారా ఆవకాయ.కామ్ ఇంటర్వ్యూలను, ఆడియో క్లిప్పులను, ఇతర పుస్తకాలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆవకాయ సభ్యులు గానీ, పాఠకులుగానీ పుస్తకాలను PDF ఫార్మాట్ లో పంపించి, ఈ సెక్షన్ లో ఉంచవచ్చు.

* This Week That Year అన్న నూతన శీర్షిక ద్వారా గత సంవత్సరాలలో వచ్చిన ఆణిముత్యాల్లాంటి రచనలను సులభంగా చదవొచ్చు.


***************

అంతర్జాలంలో Real time interviews ప్రారంభించింది, నిర్వహిస్తున్నది ఆవకాయ.కామ్. గత సంవత్సర కాలంలో ఒక రియల్ టైమ్ ఇంటర్వ్యూను శ్రీ ఐ.వి.ఎన్.ఎస్. రాజు గారితో నిర్వహించడం జరిగింది.

గత విజయదశమి తర్వాత "The March of Ten Thousand" అనే 30 భాగాల చారిత్రిక ఆంగ్ల ధారావాహికను ప్రతి ఆదివారం అందించడం మొదలుపెట్టాం. ఇది చదువరులను బాగా ఆకర్షించింది. అదే ఒరవడిలో ఇప్పుడు "పల్నాటి వీరభారతం" 15 భాగాలను ప్రతి ఆదివారం అందించడం జరుగుతోంది. మరిన్ని ఉత్తమ రచనలను weekly serials గా అందించాలని భావిస్తున్నాం. అలానే RadioChilli.net ద్వారా శబ్దపుస్తకాలను (audio books) అందించే ప్రయత్నం కూడా మొదలుపెట్టాం. ప్రయోగాత్మకంగా "పల్నాటి వీరభారతం" మొదటి ఐదు అధ్యాయాలను ధ్వనిముద్రణ చేసాము. ఈ ప్రయోగాన్ని కూడా నెటిజన్లు ఆదరించారు. ఇప్పటి దాకా 150 పైగా శ్రోతలు ఈ ధ్వని ముద్రణను విన్నారు. కొద్దిమంది శ్రోతలు ఈ ప్రయత్నాన్ని కొనసాగించాల్సిందిగా అడుగుతూ ఈమైల్స్ పంపారు. వారికి మా కృతజ్ఞతలు.


ఆవకాయ.కామ్ బ్లాగ్ ను, రేడియోచిల్లి.నెట్ బ్లాగును ప్రారంభించాం. తద్వారా బ్లాగర్ ప్రపంచానికి ఆవకాయ రచనలను దగ్గర చేసే అవకాశాన్ని పొందాం.

కొద్ది నెలల క్రితం సహృదయులు, శ్రేయోభిలాషులు సాంకేతిక పరమైన కొన్ని అమూల్యమైన సూచనలు చేసారు. ముఖ్యంగా ప్రస్తుతమున్న కోడింగ్ లో ఉన్న దోషాల నివృత్తి అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆ దోషాలను పరిహరించే దిశలో మా బృందం ప్రయత్నాలను మొదలుపెట్టింది. రాబోయే కొన్ని నెలల్లో ఆ లోపాలన్నింటినీ సరిచేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి రాగలవు.

అప్పటిదాకా మాతో సహకరించి, ప్రోత్సహిస్తారని ఆశిస్తూ...ప్రతి ఒక్కరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

శుభాభినందనలతో
ఆవకాయ.కామ్ సంపాదక బృందం

Tuesday, October 12, 2010

Sunday, October 10, 2010

బొక్కలెన్ను వారు...!!

"బొక్కలెన్నువారు తమ తిక్కలెరుగరు...నిక్కమైనదోయి కుక్క తోక"
"వెర్రోహం ఇదేం పద్యం శిష్యా!"
"వెర్రిపద్యమనుకోండి గురూ!"
"ఓహోహం! ఇలా వెర్రిపద్యాల విపర్యాసం ఎందుకు సంభవిస్తోంది శిష్యా!"
"కాంగ్రెస్ నేత, ప్రిన్స్ డార్లింగాఫ్ మేడామే సోనియా, రాహుల్ గాంధీ బాబు చరిత్రకు కొత్తర్థాలు చెబుతున్నాడుగదా గురూ?"
"కాంగ్రేసు పార్టీలో చరిత్ర లేనోళ్లెవ్వరురా!"
"అహో...అహో...విలవైన మాట. మీకు తెలిసిన కొద్దిమంది చరిత్ర పురుషుల్ని పేర్కోండి గురూ!"
"నువ్వో సంధర్భం చెప్పు. చరిత్రల్ని విప్పుతా!"
"ధన్యోస్మి! ఈ మధ్య, మధ్య ప్రదేశ్ లో రాహుల్ బాబా ఆరెస్సెస్, సిమి రెండూ మతపిచ్చి ఉగ్రవాదులే అన్నాడు గురూ!"
"వెర్రోహం! రాహుల్ బాబా అతి తెలివి అమాయకుడు శిష్యా. అందుకే అలా అన్నాడు. సల్మాన్ ఖుర్షీద్ మాత్రం గింజుకు చచ్చుంటాడు!"
"అదెందుకు గురువా? కొంపదీసి ఈ సల్మానుడు చరిత్ర పురుషుడేనా?"
"అనుమానమేలరా అక్కుపక్షి శిష్యా! సిమి ని బ్యాన్ చేసినప్పుడు వారి తరపున వకాల్తా పుచ్చుకొని కోర్టులో వాదించిన ఘన చరిత్ర సల్మాన్ ఖుర్షీదుదేరా"
"ఛా! నిజంగానే?"
"అవును శిష్యా! కానీ హిందువులకు మతిమరుపెక్కువ. రాహుల్ బాబా మాటలతో ఇప్పుడు ఆరెస్సెస్సును అనుమానంతో చూసినా చూడగలరు. పరంతూ సల్మాన్ ఖుర్షీద్ మాత్రం మైనార్టీల అభివృద్ధి మంత్రిగా సిమి తరఫున వాదిస్తూనే వుంటాడు."
"ఆహా! కాంగ్రేసుది నిజంగా సెక్యులర్ చరిత్రే గురూ!"

"గురూ! అయోధ్య తీర్పు గురించి అడితే రాహుల్ బాబా ఏమన్నాడో తెలుసా!"
"నీ నోటితోనే చెప్పు శిష్యా..నా చెవులారా వింటాను"
"జన్మస్థానం హిందువులకే చెందేట్టు తీర్పు వచ్చినా మసీదును కూలగొట్టినవాళ్ళు నేరస్తులే! శిక్ష పడాల్సిందే అని అంటున్నాడు గురూ!"
"వెర్రోహం! రాహుల్ బాబా కంటద్దాల పవర్ పెరిగినట్టుంది శిష్యా"
"మీ రహస్య, సాంకేతిక భాష అర్థం కాలేదు గురూ!"
"అది కాదురా శిష్యా! రాహుల్ బాబాకి విచారణ జరుగుతోన్న కేసు బానే కనబడుతోంది కానీ ఉరిశిక్ష ఖరారైన అప్జల్ గురూ కేసు అగుపట్టం లేదురా. వాడి క్షమాభిక్ష దస్త్రాన్ని బలంగా, భద్రంగా తమ పీఠం కింద పెట్టుకొన్నది బాబా ప్రభుత్వమే గదురా!"
"అర్రెర్రే! హుర్రెర్రే! భలే లాజిక్కు లాగారు గురూ!"
"హుహుహు! వెర్రోహం! ఇల్లాజికల్ చరిత్రలకు ఐదో తరగతి ఐక్యూ చాలురా"

To read more articles from Durbhini...Click Here
 

Wednesday, October 6, 2010

అలహాబాద్ కోర్టు తీర్పు By Raghothama Rao. C


అయోధ్య వివాదం పై అలహాబాద్ కోర్టు తీర్పు వచ్చి నాలుగు రోజులు గడిచాక నానా రకాల స్పందనలు వ్యక్తమౌతున్నాయి.
******
సగటు వామపక్షీయుడు కూడా మతాలకు అతీతమని చెప్పుకుంటాడు. కానీ గత ఆరేడు దశాబ్దాలుగా వామపక్షీయుల ధోరణుల్ని చూస్తే హిందూ మతాన్ని విమర్శించినంత జోరుగా ఇతర మతాల్ని విమర్శించి ఎరుగను.
******
వామపక్షీయులు ముస్లిం షరియాను ఒక "మత విశ్వాసం"గా పరిగణించివుంటే జిలానీ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకుంటారన్నది ఆసక్తికరమైన ప్రశ్న. కానీ వామపక్షీయులు హిందూ ధర్మ శాస్త్రాలను అన్నంత సులువుగా ఇతర మతాల ధర్మశాస్త్రాలను అనలేరు. ఇదేమీ ఆశ్చర్యం కాకపోయిన ఏ మతానికీ చెందని వారుగా, దేవుని అస్తిత్వాన్ని నమ్మలేని వారుగా చెప్పుకుంటూనే ఇతర మతాల ధర్మ శాస్త్రాలను విమర్శించే ధైర్యం లేకపోవడం ఆశ్చర్యమే.

******
అయోధ్య పై హిందూ విశ్వాసాన్ని, సాంస్కృతిక పరంపరనూ గౌరవిస్తూ ముస్లింలు తమ వాదాన్ని వదులుకుంటే వారి ఉనికికి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ "షరియా" ఒప్పుకోదన్న అడ్డుగోలు వాదాన్ని లేవనెత్తి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయడంలో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం మాత్రమే కనబడుతుంది. వందల ఏళ్ళు వెలగబెట్టిన "శాహీ తత్వం" ఇంకా వీడిపోలేదని తెలుస్తోంది.

******
ఇప్పటికీ హిందూదేశంలో హిందువులపై అప్రకటిత అత్యయిక పరిస్థితి (undeclared emergency) విధించబడి ఉంది.  భగవద్గీత కంటే ఫత్వా బలమైనది.
******
మతం పేరుతో, మతం కోసమే చేస్తున్నామని ముస్లిం ఉగ్రవాదులు చేస్తున్న చర్యలను ప్రపంచం మొత్తం నిరసిస్తోంది. బిన్ లాడెన్ మాటలకు, మొన్న TIMES NOW లో చెప్పిన లాయర్ జిలానీ మాటలకు పెద్ద తేడాలేదు. ఈ పోకడలవల్ల రాబోయే కాలాల్లో ఇస్లాం సంకుచిత స్వభావుల మతంగా మారినా ఆశ్చర్యం లేదు.

******



Click here to read complete article

Sunday, October 3, 2010

పల్నాటి వీరభారతం పదమూడవ అధ్యాయం

మనిషి జీవితంలో కాలానిదెప్పుడూ చిత్రమైన పాత్ర. కాలం మనిషినెప్పుడైనా కనికరించవచ్చు; కాటు వేయావచ్చు.
అధర్మపు పందెంలో రాజ్యాన్ని పోగొట్టుకున్న మాచెర్ల ప్రభువులు మండాదిలో అనుభవించిన జీవితం అంత సుఖకరమైనది కాదు.
రాజప్రాసాదాలలో, హంసతూలికా తల్పాల మీద పవళించిన ప్రభువులు, దుర్భరమైన వనవాసంలాంటి బ్రతుకునే గడిపారు.
వీరులైన తన పరివారం మరోసారి హృదయవిదారకమైన దెబ్బతిన్నారు. ఆత్మశాంతి లేక అలమటించిపోయిన బ్రహ్మన్న, కాలం తీసిన దెబ్బకు లొంగిపోక తప్పింది కాదు.

దెబ్బ తిన్న బెబ్బులి దెబ్బ తీయక ఉండగలదా? మౌనం వహించిన బ్రహ్మన్న ముందడుగు వెయ్యక ఉండగలడా?
మౌనం వీడిన బ్రహ్మన్న ఏం చేసాడో...చదవండి పల్నాటి వీరభారతం పదమూడవ అధ్యాయం లో

Wednesday, September 29, 2010

ఆనాటి ఆనందగీతం - By నేదునూరి రాజేశ్వరి

"ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందంలాంటి విచారం కలుగుతుంది" అని కవిత్వమల్లినా "ఆనాటి ఆ స్నేహమానందగీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతిమధురం" అని పాడినా అవన్నీ ఆ"పాత" మధురాల గురించే.



నేదునూరి రాజేశ్వరి గారు అలాంటి జ్ఞాపకాల దొంతరనే అనుభావాల మాలగా గ్రుచ్చి మనకు అందిస్తున్నారు, తమ "ఆనాటి ఆనందగీతం"లో.


పూర్తి వ్యాసం కోసం ఇక్కడ నొక్కండి...

Sunday, September 26, 2010

నా ఆలోచనల్లో అంబేద్కర్

నా ఆలోచనల్లో అంబేద్కర్ By Savyasachi K

"అంబేద్కర్" అన్న పేరు చాలు, మన రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించటానికి..."అంబేద్కర్" అన్న పేరు చాలు, నిద్రాణమై ఉన్న పీడిత, తాడిత ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించటానికి..."అంబేద్కర్" అన్న పేరు చాలు ఆత్మగౌరవంతో దళితులు తలెత్తుకొని ధీటుగా నిలబడటానికి...
ఎవరు అంబేద్కర్? స్వాతంత్ర్య సమరయోధుడా? విప్లవ వీరుడా? మేధావా?
 
******
 
ఎవరూ విమర్శలకతీతం కాదు. విమర్శలతోపాటు అభినందించదగ్గ విషయాలను కూడా ప్రస్తావించాల్సిందే. అసలు, ఆనాటి అంబేద్కర్ ఆదర్శ భావజాలానికి, ఈనాటి నియోదళితిస్టు భావజాలానికి పొంతన ఏమాత్రమూ కనిపించటంలేదు.
 
******
 
"థాట్స్ ఆన్ పాకిస్తాన్" అనే పుస్తకంలో ఆయన అంటారు "పాకిస్తాన్ వేర్పాటుతో హిందు-ముస్లీం వేర్పాటు తత్వం సమసిపోదు" అని. ఎంత దూరదృష్టితో ఆయన ఈమాట అన్నారో, ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే మనకు అర్ధమౌతుంది.


*******

Read complete article

Sunday, September 19, 2010

పల్నాటి వీరభారతం - అధ్యాయం 11

న్యాయం అనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసినా ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు.

 
మాచెర్ల వీరుల్లో పగ రగుల్కొంటోంది.

 
"ఇది అధర్మయుద్ధం. మనం అరణ్యవాసం చేయనక్కరలేదు" అని కొంతమంది అన్నారు.

 
"మాట పాటించనివాడు బ్రతికున్నా చచ్చినవాడితో సమానం. ఆడి తప్పని జాతి మనది - పందెంలో మోసం జరిగినా, మనం ఓడినట్టే లెక్క!"
మలిదేవాదులు బ్రహ్మన్నను సమర్థించారు.

తమ పరివారమూ, అంత:పురకాంతలూ - మలిదేవాదులతో ఆరోజున అరణ్యవాసానికి ప్రయాణమైనాడు బ్రహ్మన్న.


Friday, September 17, 2010

Global Recession - India And Its Link!

INDIA CAN’T SURVIVE A GLOBAL RECESSION

So says Real Estate & Stock Market expert J. Vishnu Shankar.
 
Vishnu Shankar wrote several exclusive articles for http://www.aavakaaya.com/ & predicted the high profile collapses like Satyam (Read this article)
 
Vishnu predicts that the more tougher times are ahead & this time India may not succeed in withstanding the storm.
 
In "India And Its Link" Read his eloborate analysis of current economic situation and forthcoming big & longer recession.
 

Wednesday, September 15, 2010

కుప్పతొట్టి రాజ్యాంగం


మన ఇతిహాస పురాణాలలోని సామాజిక కట్టుబాట్లను అదేపనిగా విమర్శించే కామెడీ మేధావులు మనకు మనం వ్రాసుకున్న రాజ్యాంగమనే కట్టుబాటును విమర్శిస్తే ఎందుకో తట్టుకోలేరు. దేవుడు లేడు, భక్తి ముక్తి అంతా ట్రాష్ అనే హేతువాద నాస్తికోన్మాదులు రాజ్యాంగాన్ని విమర్శిస్తే, ఆ విమర్శించినవాడికి దేశభక్తి లేదని తీర్మానిస్తారు! సరే, ఇదో విషాయంతరం కాబట్టి దాని గురించి ప్రస్తుతం వాదించటంలేదు.
సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా మనలని మనం ప్రకటించుకుని అరవై ఏళ్ళు దాటింది. ఆరు దశాబ్దాల మన రాజ్యాంగం కొందరు మేధావులకు రామాయణం కన్నా పవిత్రమైనదైతే, కొందరికి అదో అతుకుల బొంత, మరికొందరికి అదో కుప్పతొట్టి. సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకోవటంతో సంతృప్తి చెందక, 1976కల్లా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మారిపోయాం.
మన రాజ్యాంగం విమర్శలకు అతీతమా? వందకోట్లకు పైగా ఉన్న భారతీయులకు ఈ రాజ్యాంగం నిజంగానే మార్గదర్శక సూచికా? ఏమిటి ఆ గొప్పదనం?

Sunday, September 12, 2010

పల్నాటి వీరభారతం పదవ అధ్యాయం

వ్యసనం జీవనాన్ని మసిబారేట్టు చేస్తుంది.
అంత చెరువుకు ఇంత తూము చాలన్నట్టు బ్రహ్మనాయుని ఉన్నతమైన వ్యక్తిత్వంలో "కోడి పందెం" వ్యసనం మచ్చ తెచ్చేనా?
మంత్రాంగంలో శకునిని పోలిన నాగమ్మ గెలుపు కోసం అడ్డదారులు తొక్కదా?
ధర్మం, న్యాయం, మర్యాద చేతగానివాళ్ళ లక్షణాలా?

Sunday, August 29, 2010

పల్నాటి వీరభారతం అధ్యాయం-9



"కానున్నది కాకమానదు" అన్న తెగింపు ఊహించలేని పరిణామానికి దారితీస్తోంది.

పంతం, పౌరుషం పొడుచుకొచ్చినప్పుడు శాంతం, సహనం చేయి విడుస్తాయి.

నాయకురాలి కవ్వింపు సై అన్న బ్రహ్మన్న కోడిపందాలకు సిద్ధమయ్యాడు.

"కోడేరు" పొలిమేరల్లోని గుట్టల్లో గురజాల, మాచెర్ల ప్రజలు గుమిగూడారు. పుంజులు ప్రభువుల కోసం పోరాడడానికి సిద్ధంగా వున్నాయి.

చారిత్రాత్మకమైన పల్నాటి కోడిపందాలకు జరిగిన ఏర్పాట్లు ఎలాంటివి?

చదవండి...పల్నాటి వీరభారతం తొమ్మిదవ అధ్యాయంలో


 

Sunday, August 22, 2010

పల్నాటి వీరభారతం - అధ్యాయం 8



బ్రహ్మనాయుడికి మాల కన్నమదాసు ఎలా ముఖ్యుడో, నాయకురాలు నాగమ్మకు "వీరభద్రుడు" అంతే ముఖ్యుడు.
వీరకన్నమదాసు-వీరభద్రుడూ ఒకేరకపు గొప్ప యోధులు. వీరత్వానికి పల్నాటి ప్రతీకలు.
మనిషి కన్నా భయంకరమైన జంతువుగానీ, అవిశ్వాసకరమైన ప్రాణిగానీ మరొకటి లేదు. మనిషి పాలు తాగి పెరిగిన పాప, పెద్దయ్యాక అవిశ్వాసకరంగా, దుష్టుడుగా మారటానికి అవకాశమున్నది. కాని మనిషికి కుక్కపాలు పోసి పెంచితే, విశ్వాసకరంగా పెరుగుతాడనేది నాగమాంబ నమ్మకం. అందుకే దిక్కూదివాణం లేని పసివాణ్ణొక్కణ్ణి కుక్కపాలు పోసి పెంచి పెద్దవాణ్ణి చేసింది. వాడే వీరభద్రుడు. "నాగభూషణుడి"కి అలనాటి వీరభద్రుడెంతో, నాగమాంబకు పలనాటి వీరభద్రుడూ అంతే.

Click here to read the complete episode

Friday, August 20, 2010

సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా? రెండవ భాగం

లోకంలో "ధర్మం", "అధర్మం", "దేవుడు" మొదలైన పదాలున్నాయి. ఈ పేర్లతో పిలువబడే వస్తువులు మనకు తెలియనప్పటికీ అవి ఉండి తీరాలి. ఎలాగంటే మనకు తెలియని ఒక పదార్థముంటే దానికొక పేరున్నట్టే! భాషలోని ఏ పదమూ వ్యర్థం కాదు. దీన్నే కాళిదాసు -


వాగర్థావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ


అని చెప్పాడు. ప్రపంచంలో ఏదైనా ఎక్కడైనా ఉన్నా అది "వస్తువు " అన్న పేరును పొందుతుంది. క్రియలు గానీ, గుణాలు గానీ వస్తువులోనే అంతర్భావాన్ని పొందుతాయని తెలుసుకోవాలి. ఒక పదం మనకు దొరికినప్పుడు ఆ పేరుతో పిలవబడే పదార్థం మనకు తెలియకపోయినా ఆ పదం ద్వారా సూచితమయ్యే వస్తువు త్రికాలాల్లో ఎప్పుడైనా ఉండి ఉంటుందనే భావించాలి.

Click here to read complete article..

Tuesday, August 17, 2010

పల్నాటి వీరభారతం - అధ్యాయం 7

ప్రతి రాజ చరిత్రలోనూ, ఈ విధమైన రక్తపాతాలతో, ఆత్మత్యాగాలతో నిండిన ప్రేమ కథలు కనిపిస్తాయి. సజీవ సాహితికి ఇవి మెరుగులు పెడతాయి. ప్రాణం కన్నా ప్రేమే ఎక్కువైతే, ప్రేమంత గొప్పది ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు.

బ్రహ్మనాయుడు క్షణం నిశ్శబ్దంగా నిలబడి "వీరసోమా! ఈ ప్రేమికుల్ని చంపిన పాపం మనిద్దరికీ చుట్టుకుంటే, ఆ పాపంలో సగభాగం నాకూ ఉంది" అని బైటకి వచ్చాడు. వచ్చేటప్పుడు పిల్లలిద్దర్నీ చేరే చంకలో ఎక్కించుకుని మరీ వచ్చాడు.


జాలిని రేకెత్తించే నాగులాదేవి, శివసింగు అమర ప్రేమ కథను చదవండి ఈవారం "పల్నాటి వీరచరిత్ర" ఏడవ అధ్యాయంలో

Sunday, August 8, 2010

పల్నాటి వీరభారతం ఆరో భాగం

నదిలో ముందుకు పారిన నీరు - బ్రతుకులో ముందుకు కదిలిపోయే కాలం వెనక్కు రావు.

పల్నాటిలో మూడో తరం పెరుగుతోంది - బాలచంద్రుడు, మాంచాలా, పేరిందేవి రూపాల్లో!

రెండో తరపు ప్రతినిధులు - బ్రహ్మనాయుడు, నలగాముడు విరోధులుగా మారుతున్నారు.

అవమానాలతో బాటు సవతి సోదరులను బంధీలు చేసిన నలగామునిపై దండెత్తి వస్తాడు బ్రహ్మన్న.

ఈ స్థితిలో, కుటిలనీతితో మంత్రిత్వం నెరపుతున్న నాగమ్మ ఏం చేసింది?

చదవండి - పల్నాటి వీరభారతం ఆరో భాగం

Sunday, August 1, 2010

పల్నాటి వీరభారతం - అధ్యాయం 5

పతనం, ప్రళయం హటాత్తుగా రావు. కొన్ని ముందస్తు సూచనలతో, సంకేతాలతో ముందడుగులు వేస్తూ వస్తాయి.

గమనించదగ్గ కళ్ళు, నివారించదగ్గ బుద్ధి ఉన్నవారు తోడువుంటే తెలివిగా నివారించుకోవచ్చు. కానీ ఉన్మత్తస్థితిలో, ఉచ్ఛనీచాలను మరచినవారు ఆ ప్రళయోత్పాతంలో మునిగి నాశనం కావల్సిందే!

ఇదేనా నలగాముని భవితవ్యం? ఇదేనా నాయకురాలు నాగమ్మ ఇంగితం? వ్యర్థమేనా, బ్రహ్మనాయని శక్తియుక్తులు?

చదవండి - పల్నాటివీరభారతం ఐదవ భాగం

Monday, July 26, 2010

పల్నాటి వీరభారతం నాలుగో అధ్యాయం

నాయకురాలు నాగమ్మ కోటలో పాగా వేసింది. తన పాచిక పారేందుకు సకల సన్నాహాలూ చేసుకుంది.


పాపమెరుగని పసితనపు పేరిందేవి, నెలరాజులా పెరుగుతున్న అలరాజు కాబోయే దంపతులు.

తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి విషనాగును ఇంట చేర్చుకున్న నలగాముడు అనుమానపు ఊబిలోకి దిగుతున్నాడు.


మున్ముందు వీరి జీవితాలతో విధి ఎలా ఆటాడబోతున్నదో!


చదవండి...పల్నాటి వీరభారతం నాలుగో అధ్యాయం

Monday, July 19, 2010

పల్నాటి వీరభారతం - అధ్యాయం 3

ఐతాంబ-బ్రహ్మనాయులకు "బాలచంద్రుడు" లేక లేక పుట్టిన బిడ్డడు. కానీ బ్రహ్మనాయుడు కొడుకునే వదులుకోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చాడు.

బ్రహ్మనాయుని ఈ కాఠిన్యం వెనుక ఉన్న ప్రబల కారణం ఏమిటి? ఎలాంటి పరిస్థితులు ఓ కన్నతండ్రిని ఇలాంటి కార్యాన్ని చేయడానికి పురిగొల్పాయి?


చదవండి...పల్నాటి వీరభారతం మూడవభాగం

Friday, July 16, 2010

సోంపేట స్ఫూర్తి By Savyasachi K

మనం ఎన్నుకున్న ప్రభుత్వపు విధానాలు మనకు నచ్చనప్పుడు, వ్యతిరేకత ఎలా ప్రకటించాలి? అందులోనూ, మన కనీస అవసరాలకు, అవకాశాలకు ప్రభుత్వమే గండి కొడుతున్నప్పుడు ఏం చేయాలి?




కలెక్టరుకో, మరో అధికారికో వినతి పత్రాలు సమర్పిస్తాం. అవి బుట్టదాఖలౌతుంటే, కోర్టులో కేసులు వేస్తాం. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే ఓపిక లేకపోతే, మూకుమ్మడిగా ఆందోళన చేస్తాం. దాదాపు 30 గ్రామాల ప్రజలు చేసిందదే. పర్యవసానం, పాశవికంగా ప్రభుత్వం చేసిన బలప్రయోగానికి సోంపేటలో కొందరి దుర్మరణం.



తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే ప్రభుత్వ అధికారులను, పోలీసులను కాల్చి చంపే నక్సలైట్లకు, తమ విధానాలను వ్యతిరేకించే ప్రజలను పోలీసు కాల్పులతో చంపేసే ప్రభుత్వానికి తేడా ఏమిటి? నక్సలైట్లనైతే సంఘవిద్రోహులుగా ప్రకటిస్తాం. మరి ప్రభుత్వాన్నేం చేయాలి? విచిత్రమేమిటంటే, ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారినందరినీ నక్సలైట్లుగా ముద్రవేసి, ప్రగతి నిరోధక శక్తులుగా ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం.

Click here to read complete article...

Wednesday, July 14, 2010

గుండె పాట By గోపీనాథ శర్మ

గుండె పాట

వెలివేస్తు నన్ను, నువ్వెళ్ళిపోకు
తలపోస్తు నిన్ను, నేనుండలేను
నీ పాటలోని పదములు నేనే
నా బాటలోని పదములు నీవే

 

Complete poem in Avakaaya.com - Selayeru


Sunday, July 11, 2010

పల్నాటి వీరభారతం - అధ్యాయం 2

పల్నాటి చరిత్ర కాలచక్రంలో పదిహేనేళ్ళు తిరిగిపోయాయి.

రాజవిలాసాల్లో ముఖ్యమైనది - వేట. ఒకసారి అనుగురాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని కారాటవికి వేటకెళ్ళాడు.

పగలల్లా వేటాడి అలిసిపోయిన శరీరం పులిసిపోయింది. జవనాశ్వాలు సాలితో రొప్పుతూ జిట్టగామాలపడు, నాగులేటి ఒడ్డుకొచ్చాయి.

ఇప్పుడు "అనుగురాజు"కు కావల్సింది కాసేపు విశ్రాంతి, మనుష్య సంచారం తక్కువైన ఈ ప్రాంతంలో తనకోసం చలువ పందిళ్ళు వేసి, విశ్రాంతికి విడిది చూపించినవాళ్ళెవరో అనుగురాజుకు అర్థం కాలేదు. పరివారమూ, అశ్వాలూ విశ్రాంతి తీసుకుంటున్నాయి.

అప్పటికి నాగమాంబకు పద్ధెనిమిదేళ్ళు. వేదవేదాంగాలు చదువుకున్న నాగమాంబ మేనమామ సింగారెడ్డిని పదమూడో ఏట పెళ్ళి చేసుకున్నది. కానీ కాలం కాటంది, సింగారెడ్డి పెళ్ళైన సంవత్సరానికే కన్నుమూస్తే - నాగమాంబ బాలవితంతువైంది. పంటరెడ్ల కుటుంబంలో పుట్టిన నాగమాంబ శివభక్తురాలు. భర్త పోయాక నాగమాంబ "నాగమ్మ" అయింది.


పూర్తి కథ చదవాలంటే ఇక్కడ నొక్కండి

Friday, July 9, 2010

సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా? మొదటి భాగం

"విచారించి చూస్తే, సుఖం అన్నది శరీరంలోని పదార్థమే కానీ శరీరానికి ఆవలనున్నది కాదు. సుఖం జీవి (soul) అంతఃకరణం యొక్క ధర్మమే అయివున్నది."

సుఖమంటే తమకు అనుకూలమైనదనే భావించినప్పుడు, దాని ప్రతికూలమైనవన్నీ దుఃఖాలే. ఈ సుఖదుఃఖాలు మన వశంలో లేనివి. ఒకవేళ అవి మన అధీనంలోనే ఉన్నవైతే ఎవ్వరూ దుఃఖపడకూడదు. ఎల్లప్పుడూ సుఖభోగులయ్యే ఉండాలి. కానీ, అలా ఎవ్వరూ శాశ్వత సుఖభోగులు కానందువల్ల, శాస్త్రాలలో చెప్పిన విధంగా మనం అనుభవించే సుఖదుఃఖాలు మన అదుపులోలేనివని తెలుసుకోవాలి

Click here to read complete article...

Sunday, July 4, 2010

పల్నాటి వీరభారతం అధ్యాయం- 1

తెలి వులిపిరి తెరల మధ్య తెల్లవారీ ఆరకముందే, పక్షులన్నీ గూళ్ళనుంచి బైటికి వొచ్చీ రాకముందే - తేనెటీగలు పూవుల మీద ముసిరీ ముసరకముందే, "జిట్టగామాలపాడు" ఉత్తరాన వున్న బీళ్ళలో ఆరవల్లి రామిరెడ్డి అరక దున్నుతున్నాడు.

సూర్యుడు మబ్బుల మీద షికారుకు బైల్దేరినవేళ రామిరెడ్డి "చుట్ట" అంటించుకోవటానికి నిలబడ్డాడు. చేను నానుకుని, నాలుగ్గజాల దూరంలో, గట్టు మీద పెద్ద పాముపుట్ట ఉంది. రామిరెడ్డికి సుప్రభాతపు వెలుగు పర్చుకుంటున్నప్పుడు "కేర్ ... కేర్ .." మనే ఏడుపు
వినిపించింది..

అతను ఛటక్కున ఆగిపోయాడు.


పూర్తి కథ చదవాలంటే ఇక్కడ నొక్కండి

Monday, June 28, 2010